Post Views: 141
బైంసా, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకి నివాళి అర్పిస్తూ బైంసా గంజ్ లోని వ్యాపారులు మరియు ఉద్యోగులు గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్” యజమానులు, సోలంకి శేషరావు, శివకుమార్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాత్రి సమయానికి వెలిగించిన కొవ్వొత్తులతో మౌనంగా నడిచిన ఈ ర్యాలీ, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్యతను చాటిచెప్పింది. గంజ్ మార్కెట్ లోని అనేక వ్యాపారులు మరియు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....