– ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాల ప్రభంజనం
– ఆనందంతో అవధులు లేకుండా పోయిన తల్లిదండ్రుల సంబరాలు
– గ్రామానికి మంచి పేరు సంపాదించినందుకుగాను పలువురు అభినందనలు
– కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు దక్కినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: మంగళవారం రోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నసురుల్లాబాద్ మండలానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన ఉల్లెంగ శరణ్య తండ్రి పేరు పండరి తల్లి పేరు వనజ కష్టపడి చదివి 956/1000 మార్కులు సాధించింది. ఆమె నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. అదేవిధంగా నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన మరో విద్యార్థిని మామిడి వరలిక తండ్రి పేరు మక్కయ్య ఇంటర్ మొదటి సంవత్సరంలో 461/470 మార్కులు సాధించింది. ఈ విద్యార్థిని బోర్లం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించడం గమనార్హం.
మరియు నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన గౌడి శ్రీ లక్ష్మీ శ్రేష్ట తండ్రి పేరు నర్సింలు ఇంటర్ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు ఈ విద్యార్థిని నారాయణ కళాశాల బాచుపల్లి హైదరాబాద్ లో విద్యను అభ్యసిస్తుంది.
బొమ్మన్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీజ తండ్రి పేరు గంగాధర్ ఇంటర్ మొదటి సంవత్సరంలో 459/470 మార్కులు సాధించింది.
కృషి పట్టుదలతో చదివి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచి మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు సాధించినందుకు గాను వీరందరికి తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..