భైంసా, 22 ఏప్రిల్ 2025:
భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి – భైంసా విభాగం వారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణ్ రావు పటేల్ గారిని రానున్న శ్రీ హనుమాన్ మహాయజ్ఞం కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ మహాయజ్ఞం శ్రీ శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ వారి సారధ్యంలో తేదీ 28-04-2025, సోమవారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పవిత్ర కార్యక్రమం నిర్మల్ జిల్లా, కుబీర్ గ్రామం & మండలంలోని శ్రీ విఠలేశ్వర మందిరం వద్ద జరగనుంది.
అధ్యాత్మికతకు ప్రాధాన్యమిచ్చే ఈ మహాయజ్ఞానికి ప్రజలందరిని హాజరై అనుగ్రహం పొందాలని సమితి సభ్యులు కోరారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








