Post Views: 354
బోధన్ శక్కర్నగర్ వద్ద పేకాట దందా: ఐదుగురు అరెస్టు
బోధన్.శక్కర్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకునేందుకు టౌన్ సీఐ వెంకట నారాయణ, ఎస్ఐ భాస్కర్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు వారు చేపట్టిన చర్యలో, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో రూ. 3,100 నగదు, 5 మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు చట్టాన్ని గౌరవించాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరిక జారీ చేశారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








