V1News Telangana

ప్యాడి మాఫియా ఉద్ధృతి: సాలుర చెక్‌పోస్ట్ వద్ద మామూలుల మాయజాలం… . రాత్రిపూట లారీలు… పగలు ప్రశాంతం: చెక్‌పోస్ట్ వద్ద మాఫియా కుట్రలు.. . రైతుల ముసుగులో రైస్ మిల్ యజమానుల గేమ్.. సీసీ కెమెరాలు చూస్తున్నాయ్… కానీ అధికారులు చూస్తున్నారా?… . నిజామాబాద్ చెక్‌పోస్ట్ లూ మామూలు వ్యవస్థలో మునిగినవా?..

వీధి వెలుగులో నైతిక చీకటి: నిజామాబాద్‌ జిల్లా చెక్‌పోస్టుల వద్ద లారీ మాఫియా ఉధృతి…

నిజామాబాద్ జిల్లా సాలూర, ఖడ్గం, కల్దుర్కి గ్రామాల పరిధిలో ప్యాడి తరలింపు సంబంధిత అవకతవకలు తీవ్రంగా పెరిగినట్లు సమాచారం. స్థానిక చెక్‌పోస్టు — సాలుర చెక్‌పోస్ట్ వద్ద — రాత్రి వేళల్లో ప్యాడి లారీలు మామూళ్లు ఇచ్చి, ఎటువంటి తనిఖీలు లేకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

గత వారం రోజులుగా చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొంతమంది అధికారులు ఈ అక్రమాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

స్థానికంగా వ్యవసాయం చేసేవారి పేరుతో రైస్ మిల్లు యజమానులే ఈ మాఫియాను నడుపుతూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తమవుతోంది. వారు తాము అడిగినపుడు సంబంధిత అధికారులు ఏమీ చేయకుండా లారీలను సీజ్ చేయకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post