వీధి వెలుగులో నైతిక చీకటి: నిజామాబాద్ జిల్లా చెక్పోస్టుల వద్ద లారీ మాఫియా ఉధృతి…
నిజామాబాద్ జిల్లా సాలూర, ఖడ్గం, కల్దుర్కి గ్రామాల పరిధిలో ప్యాడి తరలింపు సంబంధిత అవకతవకలు తీవ్రంగా పెరిగినట్లు సమాచారం. స్థానిక చెక్పోస్టు — సాలుర చెక్పోస్ట్ వద్ద — రాత్రి వేళల్లో ప్యాడి లారీలు మామూళ్లు ఇచ్చి, ఎటువంటి తనిఖీలు లేకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
గత వారం రోజులుగా చెక్పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొంతమంది అధికారులు ఈ అక్రమాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
స్థానికంగా వ్యవసాయం చేసేవారి పేరుతో రైస్ మిల్లు యజమానులే ఈ మాఫియాను నడుపుతూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తమవుతోంది. వారు తాము అడిగినపుడు సంబంధిత అధికారులు ఏమీ చేయకుండా లారీలను సీజ్ చేయకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....