భైంసా, ఏప్రిల్ 12:
భైంసాలో కల్తీ కల్లు దుకాణాలపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎక్సైజ్ సీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
స్థానికులు ఆరోపిస్తున్న విషయం ఏంటంటే, ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లు వ్యాపారులతో చేతులు కలిపారని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. సరైన లైసెన్సులు లేని దుకాణాలు నిర్భయంగా పనిచేస్తుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని చెప్పారు.
“ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే, పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసి, ఉన్నత స్థాయి విచారణ కోరతాం. అధికారులు గానీ, కల్తీ వ్యాపారులు గానీ తప్పించుకోలేరు” అని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.
ప్రజలు చేసిన విన్నపం మేరకు సంబంధిత శాఖలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....