నిర్మల్ జిల్లా, కుంటాల మండలం, ఓలా గ్రామం:
ఈరోజు వాసరశ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ ముత్తన్న గారు, వాడేగర్ లక్ష్మణ్ గారు హాజరై విద్యార్థులను అభినందించారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గజానంద్ గారు, డి. అనిల్ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ యువత, టీచర్లు, గ్రామ పెద్దలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అతిథులు మాట్లాడుతూ విద్యారంగంలో గ్రామ విద్యార్థులు సాధిస్తున్న పురోగతిని ప్రశంసించారు. ప్రత్యేకించి గురుకుల పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు.
పాఠశాల టీచర్లు, గ్రామస్తులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని నిర్వాహకులు తెలిపారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....