– NRI కోనేరు శశాంక్
– నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ సహకారంతో మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులకు ప్రెస్ క్లబ్ కు అవసరమయ్యే ఫర్నిచర్ అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముత్తకుంట వేణు గోపాల్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు ను శాలువా తో ఘనంగా సత్కరించారు. ఫర్నిచర్ అందించి సహకరించినందుకుగాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మహెబూబ్, భవాని సింగ్ ఠాకూర్, మహేబూబ్ , బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు, శక్తి కేంద్రం ఇంచార్జ్ గంగాధర్ గుప్తా, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, రాఘవ, పవన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..