మారుతి మందిరంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా
విశ్వవసునామ సంవత్సరాన్ని పురస్కరించుకొని మారుతి మందిరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తుల కోసం ఉగాది పచ్చడి వితరణ చేయడం జరిగిందని ఆలయ కమిటీ తెలిపింది.
ఇక ఈ సందర్భంగా స్వామివారికి ద్రాక్షల చేత ప్రత్యేక అలంకరణ నిర్వహించబడింది. ఈ ద్రాక్ష పండ్లను హనుమాన్ భక్తులు అంకితం చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్, ఆలయ కమిటీ చైర్మన్ గుండేడి శంకర్, బోదు శేఖర్, హనుమాన్ భక్తులు గురుస్వాములు, చందు గురుస్వామి, కన్నయ్య, విజయ గురుస్వామి, గురుస్వామి రాజు తదితర భక్తులు పాల్గొన్నారు.
ఈ ఉగాది వేడుకలు భక్తుల హర్షం కలిగించాయి. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో మార్మోగింది. హనుమాన్ భక్తుల సేవా భావం మరోసారి దర్శనమిచ్చింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








