బోధన్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ పంతులు, మహేష్ పంతులు తదితర అర్చకుల నేతృత్వంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి.ఉదయం నుండే ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా అభిషేకాలు, హోమాలు, శివ పూజలు నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ చక్రేశ్వరునికి పంచామృతాభిషేకం, మహా ఆరతి నిర్వహించగా, ఆలయ ప్రాంగణంలో భక్తుల హర్షధ్వానాలు మారుమోగాయి.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్పాలతో, దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడం విశేషం. భక్తులు ఈ సందర్భంగా ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.భక్తుల సహకారంతో వేడుకలు శాంతియుతంగా ముగియగా, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








