. బాధితుడి ఆవేదన: తన అనుమతి ఉన్నా టిప్పర్ను వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకొని కేసు చేశారంట!
ఇసుక రవాణా వివాదం –
అక్రమ ఇసుక రవాణా: ఆరోపణలు తప్పుడు అంటున్న ఎమ్మార్వో!
. బాధితుడి ఆరోపణలు vs అధికారుల వివరణ – నిజం ఏది?…
ఇసుక మాఫియాకు రెవెన్యూ అధికారుల సహకారం? బాధితుడి ఫోన్ రికార్డింగ్ ఏమి చెబుతుంది?
జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన సమయం ఆసన్నమా?
బోధన్: స్థానికంగా ఇసుక రవాణా వివాదం చర్చనీయాంశంగా మారింది. బాధితుడు సయ్యద్ అజీజ్ ఆరోపణల ప్రకారం, తన అనుమతులు కలిగిన వాహనాన్ని రెవెన్యూ అధికారులు అక్రమంగా తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. అయితే, ఎమ్మార్వో విఠల్ మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
రెవెన్యూ అధికారుల ప్రకటన:
సదరు వాహనం అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు.
వేబిల్ లేని వాహనాన్ని పట్టుకోవడం అనివార్యం అని పేర్కొన్నారు.
బోధన్లో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాధితుడి ఆరోపణలు:
రెవెన్యూ అధికారులు అక్రమంగా తన వాహనాన్ని పట్టుకున్నారని ఆరోపించారు.
ఆర్ఐ గంగాధర్ ఫోన్లో తనతో మాట్లాడి, ఇసుక మాఫియాకు సమాచారం అందిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు.
తన దగ్గర ఫోన్ రికార్డింగ్ ఉందని, అధికారుల నిజస్వరూపం బయటపడుతుందని అన్నారు.
. రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితుడి ఫోన్ రికార్డింగ్లో ఏముంది? పై అధికారులు దీనిపై విచారణ జరుపుతారా? లేక వదిలేస్తారా? అనేది చూడాలి.
సందేహాలు:
రెవెన్యూ అధికారులు నిజాయితీగా వ్యవహరించారా?
ఫోన్ రికార్డింగ్లో ఏం ఉంది?
నిజంగా అక్రమ ఇసుక రవాణానేనా? లేక అధికారుల దుర్వినియోగమా?
జిల్లా కలెక్టర్ దీనిపై ఏమి చర్యలు తీసుకుంటారు?
ప్రజలే తీర్పు ఇవ్వాలి – బాధితుడి డిమాండ్!

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....