బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్ల గ్రామానికి చెందిన సయ్యద్ అజిత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇసుక టిప్పర్ నడిపేందుకు అన్ని అనుమతులున్నా, బోధన్ ఆర్ఐ గంగాధర్ అక్రమంగా మామూలు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు.
అజిత్ ఆరోపణల ప్రకారం, ఒకప్పుడు ఒక్కో టిప్పర్కు రూ.50,000 వసూలు చేసేవారని, ఇప్పుడు చిన్న టిప్పర్లను కూడా వదిలిపెట్టడం లేదని తెలిపారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో, ఆర్ఐ తన టిప్పర్ను బోధన్ ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి, కేసు పెట్టించాడని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన స్థానికులు, బాధితుడి ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రవాణా శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయంపై ఆర్ఐ గంగాధర్ స్పందిస్తూ, “నాకు ఎలాంటి సంబంధం లేదు, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు” అని వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత త్వరగా పరిశీలిస్తుందో చూడాలి!

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....