V1News Telangana

best news portal development company in india

కళాశాలలో మత్తు, మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు

SHARE:

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రు యువ కేంద్రం, సాయి ఆదర్శ యువతీ మండలి సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్, హెచ్ఐవి/ఎయిడ్స్, మరియు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సురేష్, సిఐ వెంకట్ నారాయణ, సాయి ఆదర్శ యువతీ మండలి ప్రెసిడెంట్ పద్మ సింగ్, ప్రభుత్వ హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ డి. రాజన్న, పానా లాయర్ కళ్యాణి, మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చట్టాలపై అవగాహన కల్పించి, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో మత్తు పదార్థాలపై అవగాహన పెంచి, చట్టసంబంధమైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india