Post Views: 111
బోధన్, మార్చి 8: గోదావరి అర్బన్ బ్యాంక్ బోధన్ బ్రాంచ్ లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఇందూర్ సామంత్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలంటే ఫైనాన్షియల్ లిటరసీ చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ వేడుకలో పలువురు మహిళలను ఘనంగా సత్కరించడంతో పాటు, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రాం నిర్వహించి, మహిళలకు ఆర్థిక స్వావలంబనపై అవగాహన కల్పించారు. మహిళలకు అవసరమైన సహాయ, సహకారాలను బ్యాంకు అందిస్తుందని మేనేజర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ స్టాఫ్ నార్ల మహేష్, ఇందూర్ తులసీరామ్, వైభవి, అరవింద మరియు బ్యాంక్ మిత్రాలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








