ఇసుక అక్రమ తవ్వకాలకు చెక్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
తెలంగాణలో ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించడం కీలకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన సమీక్షలో, అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.
ఇసుక సరఫరాను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడం ద్వారా అక్రమ వ్యాపారాన్ని అరికట్టవచ్చని సీఎం పేర్కొన్నారు. దీనికోసం నగర పరిసరాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక, మైనింగ్ క్వారీలకు విధించిన జరిమానాలను వసూలు చేయడం, మైనర్ బ్లాక్ల వేలానికి టెండర్లు పిలవడం వంటి చర్యలు అక్రమ మైనింగ్ నియంత్రణలో భాగమని తెలిపారు.
ఈ చర్యలు నిజంగా అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణలో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ప్రభుత్వ చర్యలు కఠినంగా అమలైతే, ఇసుక మరియు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలపై కట్టుదిట్టమైన నియంత్రణ సాధ్యమవుతుందనే నమ్మకముంది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....