Post Views: 145
నిజామాబాద్, ఫిబ్రవరి 28: బోధన్ & సాలురా మండలాల సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టారు. శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు, పోలీస్ సిబ్బంది కలిసి D-28 కాలువను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మెయిన్ కాలువ వరకు ఉన్న తూములను పరిశీలించి, చివరి ఆయకట్టు రైతులు (సాలురా క్యాంపు, కుమ్మన్ పల్లి, జాడి జమాల్ పూర్, ఫాతేపూర్, నాగన్ పల్లి) ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిగణనలోకి తీసుకున్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా తగిన నీటి సరఫరా కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








