కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే హంగామా ఎడ్యుకేషన్ బిల్డ్స్ బ్యూటిఫుల్ లైఫ్!!
గురువు చెప్పే పాఠాలు భవిష్యత్తు పునాదులు ఫేర్ వెల్ ప్రతి విద్యార్థికి మధుర అనుభూతి
ఇంటర్ సక్సెస్ ఉన్నత చదువులకు ఓపెన్ ఛాలెంజ్
గోదావరిఖని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మడత రమేష్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 28:-
ఎడ్యుకేషన్ బిల్డ్స్ బ్యూటిఫుల్ లైఫ్ అని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు గోదావరిఖని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ మడత రమేష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో “ఫ్లెడ్గ్లింగ్ ఫెస్ట్ 2025” పేరిట చేపట్టిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీకి ఆ కళాశాల చైర్మన్ అండ్ డైరెక్టర్ నాగండ్ల జమున రవికుమార్ గురువు, ప్రస్తుత గోదావరిఖని ఏసిపి ఎం.రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మొదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రజెంటేషన్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో రాష్ట్రస్థాయి మార్కులను సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సైతం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ గురువు చెప్పే పాఠాలు ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తుకు పునాదులు అని తెలిపారు. విద్యార్థి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ప్రథమ లక్ష్యమైన చదువుపై ఫోకస్ పెట్టి అత్యధిక మార్కులు సంపాదించి ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి అని సూచించారు. ఫేర్ వెల్ ప్రతి విద్యార్థికి ఒక మధుర అనుభూతి అని తెలిపారు. తన స్టూడెంట్ లైఫ్ లో ఇలాంటి పార్టీలలో ఎన్నో సార్లు ఆనంద క్షణాలను పొందినట్లు ఆనాటి జ్ఞాపకాలను సభా సాక్షిగా విద్యార్థినీ విద్యార్థులతో నెమరు వేసుకున్నారు. ఇంటర్ సక్సెస్ ఉన్నత చదువులకు ఓపెన్ ఛాలెంజ్ అని అన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి సమాజంలో వారికి గొప్ప పేరు తీసుకురావాలి అని సూచనలను చేశారు. అనంతరం కళాశాల చైర్మన్ అండ్ డైరెక్టర్ నాగండ్ల జమున రవికుమార్ కార్యక్రమం ముఖ్య అతిథి ఏసీపీని ఘనంగా శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రశంసా పత్రంలోని అద్భుతమైన వాక్యాలను తన మాటల ద్వారా క్లుప్తంగా ఆనంద నయనాలతో చదివి వినిపించారు. తనకి తన గురువు అయిన ఏసీపీ రమేష్ ఇన్స్పిరేషన్ అని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తన గురువు ఏసీపీకి సాష్టాంగ నమస్కారం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాను ఎలాంటి కష్టనష్టాలకైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ వేడుకలలో విద్యార్థినీ, విద్యార్థులు ఆడి పాడి కేరింతలతో మధుర అనుభూతులను తమ తమ సెల్ ఫోన్లలో సెల్ఫీల ద్వారా చిత్రీకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకన్న, అకాడమిక్ ప్రిన్సిపల్ ఎస్.తిరుపతి రెడ్డి, లెక్చరర్లు, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, పోషక మహాశయులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM