Post Views: 105
– స్వాధీనం చేసుకున్న ఇసుకను గ్రామస్తుల సమక్షంలో వేలం పాట నిర్వహణ
– అక్రమ ఇసుక, మొరం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
– తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఇసుకను మంగళవారం రోజు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు. ఉత్కంఠంగా సాగిన వేలం పాటలో గ్రామానికి చెందిన కూని మహేందర్ గౌడ్ రూ.38,500 కు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్, నాయబ్ తహసిల్దార్ బావయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








