Post Views: 106
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో బుధవారం రోజు మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ కొరడా ఝలిపించారు. ఈ తనిఖీలలో అర్హత లేకుండా ఎంబిబిఎస్ డాక్టర్లమని చెప్పుకుంటూ చలామణి అవుతూ వైద్యం నిర్వహిస్తున్న ముగ్గురు నకిలీ డాక్టర్లను గుర్తించారు. అర్హత లేకపోయినప్పటికీ వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసులు సాయి శ్రీనివాస్, సురేష్, ప్రకాష్ లను అరెస్టు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








