– కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పేద ప్రజల పాలిట పెన్నిధి
– ప్రజలందరూ ఆనందంగా జీవించాలి
– మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు “కళ్యాణ లక్ష్మి” ,”షాదీ ముబారక్” లబ్ధిదారులకు మాజీ ఎంపీపీ పాల్త్య విటల్ బ్యాంకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” కళ్యాణ లక్ష్మి”,” షాది ముబారక్” సంక్షేమ పథకాలు పేదల పాలిట పెన్నిధిగా ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వధువులకు ఈ పథకం చాలా గొప్పగా ఆర్థిక సహకారంగా చేయూతనిస్తుందని అన్నారు. నసురుల్లాబాద్ మండలానికి 32 మందికి మంజూరు అయిందని తెలిపారు. ప్రజా ప్రతినిధిగా లబ్ధిదారులకు బ్యాంకు చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో , శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శనంలో పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు(ఎంపీటీసీ) కంది మల్లేష్, మాజీ సర్పంచ్ వెంకటరమణ, ఆర్ ఐ సాయిలు, అస్గర్ అలీ, దుర్గం శ్రావణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..