– నిర్విరామంగా ఉద్యమం చేసిన రైతన్నలు
– జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
– హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
– పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ
– బీజేపీ నసురుల్లాబాద్ అధ్యక్షులు సున్నం సాయిలు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియామకం చేసిన సందర్బంగా బీజేపీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ,బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్,జిల్లా పార్టీ అధ్యక్షుడు కులచారి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా సున్నం సాయిలు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకరమన్నారు. స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలపై సేవకుడిగా పనిచేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగిన పల్లె గంగారెడ్డిని ప్రత్యేకంగా భవిష్యత్తులో రైతులతో కలిసి వారి సమస్యల పట్ల ప్రభుత్వంతో చర్చలు జరిపి వారికి పసుపు పంటకు మంచి మద్దతు ధర ఇప్పించే విధంగా సేవలు అందించాలని కోరారు.ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తానని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ పై రైతులకు రాసిచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని,ఇది ప్రజా ప్రభుత్వ మని బీజేపీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..