*మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగినికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి…
-సమ్మె కాలపు ఒప్పందాని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ…
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం కేజీబీవీ పనిచేస్తున్న మల్లమ్మ మరణం పట్ల తీవ్ర బ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి భరోసానివ్వాలని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
30-12-2024 రోజున 30kgs వండిన అన్నం గిన్నె పొయ్యినుండి కిందకు దించే సమయంలో జారి కడుపుకి కాలడం జరిగింది.
బాగా కాలడం వలన ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా హైదరాబాద్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా హార్ట్ స్ట్రోక్ తో కోమా లోకి వెళ్లి ఈ రోజు అంతిమ శ్వాస విడిచారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు నెల రోజుల సమ్మె చేసిన సమయంలో ఇద్దరు
మరణించిన వారికి కూడా ఎక్స్ గ్రెషియా చెల్లిస్తామని ప్రభుత్వం & అధికారులు హామీ ఇచ్చినారు.
కావున వెంటనే పది లక్షలు ఎక్స్ గ్రేషియా విడుదల చెయ్యాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరినారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....